Tirumala: శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి..

by Jakkula Mamatha |   ( Updated:2024-07-20 15:08:42.0  )
Tirumala: శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి..
X

దిశ, తిరుమల:తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం శనివారం ఉదయం సమయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం హోం మినిస్టర్ అనిత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ..శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగింది. అలాగే స్వామివారి ఆశీస్సులు నిండుగా కూటమి ప్రభుత్వం పై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలలో భక్తులు ఆనందంగా కనపడుతున్నారు. గతంలో కన్నా కొండపై సౌకర్యాలు బాగున్నాయని భక్తులు నాకు చెబుతున్నారని ఆమె తెలిపారు.

Read More..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed